Search
  • Follow NativePlanet
Share
» »వైద్యులకే సవాల్ గా వున్న మిరాకిల్ రోగం ఇక్కడ నయమవుతుంది ...

వైద్యులకే సవాల్ గా వున్న మిరాకిల్ రోగం ఇక్కడ నయమవుతుంది ...

ఏదైనా రోగం వచ్చినప్పుడు సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తారు.అయితే ఆ రోగం నయం కాదు అని తెలిసినతర్వాత భగవంతుణ్ణి వేడుకుంటాము. మన భారతదేశంలో దేవతలను అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తాము.

By Venkatakarunasri

ఏదైనా రోగం వచ్చినప్పుడు సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తారు.అయితే ఆ రోగం నయం కాదు అని తెలిసినతర్వాత భగవంతుణ్ణి వేడుకుంటాము. మన భారతదేశంలో దేవతలను అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తాము.ఆశ్చర్యం ఏమంటే మన భారతదేశంలో మిరాకిల్స్ జరిగేది ముఖ్యంగా దేవతలు మరియు మానవఅవతారం ఎత్తిన దేవుళ్ళలో ప్రధానంగా చూడవచ్చును. ఈ వ్యాసంలో పక్షవాతం (పెరాలసిస్) వంటి నయంచేయలేనటువంటి భయంకరమైన రోగాల్ని కూడా నయం చేసే మహిమాన్విత దేవాలయం గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వైద్యుల చేతిలో సాధ్యంకానటువంటివి, దేవాలయానికి వెళ్తే అవుతుంది అని భావించటం సహజం. అయితే నమ్మకం వుంటే మాత్రం ప్రతిఒక్కటి సాధ్యమౌతుంది,. భగవంతుడు మనతో పాటే వుంటాడని నమ్మకం కుదరటానికి ఈ దేవాలయం ఒక నిదర్శనం. ఈ దేవాలయంలో పక్షవాతం (పెరాలసిస్) వంటి నయం చేయలేనటువంటి భయంకరమైన రోగాలను కూడా నయం చేస్తారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ వుంది? ఆ దేవాలయానికి వచ్చే రోగులకు పెరాలసిస్ రోగం నిజంగా నయం అవుతుందా?అని అనేక ప్రశ్నలకు జవాబులు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి.

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

ఈ మహిమాన్వితమైన దేవాలయానికి ముఖ్యంగా పక్షవాతం (పెరాలసిస్) రోగంతో బాధపడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు. అలాంటివారు ఈ దేవాలయంలో 7రోజులు వుండవలెను. భక్తులు ఇక్కడ వుండటానికి వసతిసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు కూడా వున్నాయి.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

కానీ కేవలం కొన్ని గదులు కలిగిన భారీ భవనం నిర్మించబడింది. వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి మరియు వారి పక్షవాతం (పెరాలసిస్) వ్యాధిని నయం చేసుకుంటారు.
ఇక్కడ పక్షవాతం ఉన్న రోగులేకాకుండా వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కూడా స్వామిని దర్శించుకుని రోగాలను నయంచేసుకుంటారు.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

ఇది ఒక మూఢనమ్మకం అని భావించవద్దు. అయితే అనేక చికిత్సలతో కూడా బాగుచేయలేనటువంటి వివిధ రోగులు ఈ దేవాలయానికి వచ్చి బాగుపడిన ఉదాహరణలు అనేకం వున్నాయి. ఇక్కడ చమత్కారాల కన్నా ఎక్కువ నమ్మకం వల్ల పనులు చక్కబడుతాయనే చెప్పవచ్చును.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

500ల సంవత్సరాలకు ముందు ఒక సన్యాసి గురువు ఈ ప్రదేశానికి వచ్చి తన తపశ్శక్తితో మరియు ధ్యానంతో అతను అక్కడికి వచ్చే వారి రోగాలను నయం చేస్తూవుండేవారు.ఆ సన్యాసి సమాధిని కూడా ఈ దేవాలయంలో చూడవచ్చును.ఈ సమాధిచుట్టూ 7 రోజులపాటు,7ప్రదక్షిణలు చేసిన వారికి అనారోగ్యం అనేది దూరమౌతుంది అనేది భక్తుల ప్రబలమైన నమ్మకం.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

ఆ 7 రోజులు పాటు ప్రదక్షిణం చేసిన అనంతరం అక్కడ మంగళహారతి చేస్తారు. ఆ మహిమగల హారతి తీసుకున్న అనంతరం అనేక మంది రోగులకు పడిపోయిన కాళ్ళు,చేతులు తిరిగి వస్తాయి మరియు మరియు పక్షవాతంతో మాటపడిపోయిన వారు కూడా కొద్దికొద్దిగా మాట్లాడతారు.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

ఈ దేవాలయం ముఖ్య విశేషం ఏమంటే భక్తుల దగ్గర ఏవిధమైన డబ్బును ఆశించరు. బదులుగా భక్తులే తమ రోగాలునయం కావటం వల్ల దేవాలయం అభివృద్ధికి ధనసహాయం చేస్తారు. ఈ విధంగా వచ్చిన ధనసహాయంతో దేవాలయం నిర్వహణ చేస్తారు.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయం వుండేది రాజస్థాన్ రాష్ట్రంలో నాగూర్ జిల్లాలో. ఈ దేవాలయాన్ని చతూర్ దాస్ జీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం నాగూర్ జిల్లా దేగాన అనే మండలంలో బుడాటి అనే ప్రదేశంలో వుంది.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

ఈ దేవాలయం సుమారు 200సంల క్రితం నాటిదని చెప్పవచ్చును. ఆశ్చర్యంఏమంటే ఈ దేవాలయానికి ప్రతినిత్యం 200 నుంచి 250పక్షవాతం (పెరాలసిస్) భక్తులు వస్తూంటారు.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

పక్షవాతం (పెరాలసిస్) నుంచి బాధపడుతున్న రోగులు 7 రోజులపాటు ఇక్కడ వుండవలెను.అదేవిధంగా 1 రోజుకు 2సార్లు దేవునికి హారతిని ఇస్తారు. ఆ హారతి సమయంలో పక్షవాతం (పెరాలసిస్) ఖచ్చితంగా వుండాలి.అనేక మంది భక్తులు కోలుకున్నఎన్నో నిదర్శనాలు వున్నాయి.

pc:youtube

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?

చతుర్ దాస్ జీ మహారాజు మందిరానికి ఎలాంటి ప్రవేశరుసుము లేదు.ఈ దేవాలయానికి ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. పక్షవాతం (పెరాలసిస్) నుంచి బాధపడుతున్న వారు ఎటువంటి చికిత్సనుంచి నయం కాని వారు ఈ దేవాలయానికి వచ్చి చూడండి.

pc:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

సమీప విమానాశ్రయం

సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్. ఇక్కడి నుంచి నేరుగా బస్సులు వున్నాయి.ఇక్కడి నుంచి చతుర్ దాస్ జీ మందిరానికి వెళ్ళుటకు సుమారు 5 నుండి 6గంటల కాలం ప్రయాణం చేయవలసివుంటుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

సమీప రైల్వే స్టేషన్

ఈ మహిమగల దేవాలయాన్ని చేరటానికి సమీప రైల్వేస్టేషన్ బూడాటి మెట్రో రైల్వేస్టేషన్.ఇక్కడినుండి సులభంగా దేవాలయానికి చేరవచ్చును.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X