Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

తంజావూరు కు ఆ పేరు తంజన్ అనే పదం నుండి వచ్చింది. హిందూ మతం పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో శివుని చేతిలో హతమైనాడు. ఆ రాక్షసుని ఆఖరి కోరిక మేరకు పట్టణమునకు ఆ పేరు పెట్టెను.

By Venkatakarunasri

తంజావూరు కు ఆ పేరు తంజన్ అనే పదం నుండి వచ్చింది. హిందూ మతం పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో శివుని చేతిలో హతమైనాడు. ఆ రాక్షసుని ఆఖరి కోరిక మేరకు పట్టణమునకు ఆ పేరు పెట్టెను. తంజావూరుకు ఆ పేరు రావటానికి మరొక కారణం ఉన్నది. 'తన్-జా -ఊర్' అంటే నదులు మరియు ఆకుపచ్చ వరి పొలాల్లో చుట్టూ ఉన్న స్థలం అని అర్ధం. చోళ రాజు కరికలన్ సముద్రం ద్వారా వరదలు సంభవించినప్పుడు పూంపుహార్ కు ఆ సమయంలో వారి రాజధాని నగరంగా తంజావూరు ను ఉంచటం జరిగింది.

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఎక్కడ వుంది?

బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటుతున్నాయి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

తంజావూరులోనే కాదు దక్షిణభారతదేశంలో బృహదీశ్వర దేవాలయం అతిపెద్ద ఆలయంగా ముద్ర పడింది. శిల్పకళలకు, సాంస్కృతికంగా,చారిత్రకంగా ప్రతీకగా నిలిచింది. క్రీ.శ.11 వ శతాబ్దంలో రాజరాజ చోళ తన సైనికబలగాలతో చుట్టుపక్కల ప్రాంతాలపై యుద్ధభేరి మ్రోగించి తన ఏలుబడికి తెచ్చుకున్న సందర్భంగా బృహదీశ్వర ఆలయంలో పరమశివుడ్ని ప్రతిష్టించారని చరిత్ర చెబుతుంది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఆనాటినుండి రాజరాజచోళునికి ఎదురనేది లేకుండా పోయింది. తన రాజ్యాన్ని సుభిక్షంగా, సస్యశ్యామలంగా చేయటమే కాదు.పదుగురికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్ది చూపించాడు.ఇదంతా ఎలా జరిగింది అంటే ఇది పరమశివుని కృప అంటాడు.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

అందువల్లనేనేమో నిత్యం ధూపదీపనైవేద్యాలతో భక్తుల శివ నామస్మరణతో బృహదీశ్వర ఆలయం కళకళలాడుతునే వుంటుంది. ఈ ఆలయంలో సుమారు 12అడుగుల ఎత్తైన శివ లింగం సాక్షాత్కరిస్తూ భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేస్తూ వుంటుంది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

అందుకు తగ్గట్టుగా ఆలయముఖ ద్వారంలో 12 అడుగుల మహానంది క్షేత్రపాలకుడిగా పర్యవేక్షిస్తుండటం విశేషం.ఇది ఆలయం ముఖద్వారం వద్ద ప్రతిష్టించబడి వుంటుంది. బృహదీశ్వరఆలయంలో మనకు తెలియని ఒక ప్రత్యేకత వుంది.అది ఏమిటంటే గోధూళివేళ ఈ ఆలయఛాయలు కనిపించవు.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

సంవత్సరం పొడవునా ఏరోజు సాయంత్రం వేళ ఆలయం నీడలు భూమి మీద పడకపోవటం అంతు చిక్కని నిదర్శనం. శాస్త్రపరిశోధకులు పురాతత్వ శాస్త్రఘ్నులు ఏ రీతిన చూసినా ఇప్పటికి వీడని మిస్టరీగానే మిగిలింది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి గ్రానైట్ తో నిర్మించిన ఆలయం ఇది. అయితే 100ల మైళ్ళదూరం వరకూఎక్కడా కూడా గ్రానైట్ అనేది కనిపించదు. గ్రానైట్ క్వారీలనుంచి ఇక్కడి రాళ్ళను ఏవిధంగా తీసుకువచ్చారో ఎంతకాలం పట్టిందోమరి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

గ్రానైట్ పై శిల్పాలను మలచటం కష్టంతో కూడుకున్న పని.అటువంటిది అంత దూరం నుంచి రాళ్ళను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించటానికి ఆనాటి శిల్పులు, కళాకారులు,ఎంత శ్రమపడ్డారో.
ఆలయ నిర్మాణానికి 7ఏళ్ళు పట్టిందంట.క్రీశ 1003నాటికి బృహదీశ్వరాలయానికి సంబంధించిన మహత్తరకార్యక్రమం ముగిసింది. ఎత్తైన ఆ శిఖరంపైకి ఆ బరువైన రాతిని ఎలాతెచ్చారో వూహకందని విషయం.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ నిర్మాణ శిల్పి చైన్నై మరియు మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు 5 సంవత్సరాల[1004AD - 1009AD] కాలంలో పూర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 km ఎత్తుకు చేర్చబడింది. అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఆలయ విగ్రహాలు

ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఇక్కడికి దగ్గరలో చూడవలసినవి

సంగీత మహల్

సంగీత మహల్ లేదా సంగీతం యొక్క హాల్ తంజావూరు ను సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం. దీని మొదటి అంతస్తులో తంజావూరు ప్యాలెస్ ఉంది. దీనిని సేవప్ప నాయక్ అనే ఒక నాయక రాజు యొక్క పాలనలో 17 వ శతాబ్దం ప్రారంభ భాగంలో నిర్మించారు. చోళ మరియు నాయక్ పాలకుల కాలంలో సంగీత మహల్ వివిధ సంగీతకారులు మరియు నృత్యకారులు ప్రదర్శనల కోసం ఈ ప్రదేశం ఉపయోగించబడింది. ఇది ఆ కాలానికి చెందిన భవన నిర్మాతలు మరియు వాస్తుశిల్పులు ప్రదర్శితమవుతున్న అద్భుతమైన నైపుణ్యంనకు శాశ్వత గుర్తుగా నిలిచింది. సంగీత హాల్ పరిపూర్ణ ధ్వనితో రూపొందించబడింది. అందువల్ల ఇక్కడకు వచ్చే పర్యాటకులకు చింతలు పోయి మంచి మానసిక స్థితి కలుగుతుంది. ఆ సమయంలో గొప్ప సంగీతకారులు మధ్య సంగీతం పోటీలు హాల్ లో ఏర్పాటు చేసేవారు. సంగీత మహల్ లో ప్రస్తుతం చేతివృత్తులవారు, హస్తకళాకృతుల ప్రదర్శనల కోసం ఉపయోగిస్తున్నారు.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

విజయనగర కోట

విజయనగర కోట పెద్ద ఆలయం లేదా బ్రహదీస్వర ఈశాన్య ప్రాంతంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నది. నాయక్ లు మరియు మరాఠా రాజుల 16 వ శతాబ్దం AD మధ్య భాగంలో నిర్మించింది మొదలుకుని పూర్తి అయ్యేవరకు ప్రత్యేక కార్యాచరణ బాధ్యత తీసుకున్నారు. కోట లోపల తంజావూర్ ప్యాలెస్, సంగీత మహల్, తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ, శివ గంగా గార్డెన్ మరియు సరస్వతి మహల్ గ్రంధాలయం ఉన్నాయి. ఫోర్ట్ భవంతి వెనుక శత్రువులు చొరబాటు వ్యతిరేకంగా ప్యాలెస్ కు రక్షణ ఉండేది. ఈ కోట చాలా శిధిలావస్థలో ఉంది, మరియు దీనిని ఒక పర్యాటక ఆకర్షణగా సాధారణ ప్రజలు సందర్శించవచ్చు. కళ, వాస్తుశిల్పం మరియు చరిత్రలో ఆసక్తి గల పర్యాటకులు ఈ కోట ను చూడటం మాత్రం మిస్ కావద్దు. కోట లోపల ఉన్న ఇతర ఆకర్షణలను సందర్శించండి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఆర్ట్ గ్యాలరీ

తంజావూరు లో ఆర్ట్ గ్యాలరీ 1600 AD లో నిర్మించబడినది మరియు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన గణాంకాలు మరియు చిత్రాలు అనేక రకాలు ఇక్కడ ఉన్నాయి. తంజావూరు ప్యాలెస్ యొక్క స్వంత భవన నిర్మాణం ఆశ్చర్యకరంగా ఉంటుంది. తంజావూరు ఆర్ట్ గ్యాలరీ విస్తృతంగా కళాఖండాలు, చారిత్రిక వస్తువులను మరియు 9 నుండి 12 వ శతాబ్దాల మధ్య కాలంలో ఉనికిలో ఉన్న ప్రముఖ కళాత్మక కాంస్య చిత్రాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తంజావూరు జిల్లాలో అనేక ఆలయాల నుండి తీసుకురాబడిన చారిత్రిక వస్తువులు కూడా ఉన్నాయి. ఈ గ్యాలరీ ఇందిరా మందిర్, పూజా మహల్ మరియు రామ చౌదం హాల్ అనే మూడు విభాగాలుగా విభజించబడింది. రామ చౌదం హాల్ లో కాంస్య విగ్రహాలకు మరియు చిత్రాల సేకరణకు, పూజా మహల్ లో రాతి శిల్పాలకు, ఇందిరా మందిర్ లో ఇళ్ళు ,అయుదశాల మరియు దేవుని యొక్క వివిధ రూపాలు ఉంటాయి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఉత్తమ సమయం

తంజావూరు సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబరు నుంచి మార్చి మధ్య ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు తేమతో కూడి ఉంటుంది ,అయితే సందర్శనా కోసం అనుకూలమైన ఆధునిక ఉష్ణోగ్రత హేతుబద్ధంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్టోబరు నుంచి మార్చి నెలల మధ్య అయితే, చాలా అనుకూలంగా ఉంటుంది. స్వెటర్ లతో వేడిని తగ్గిచుకొని మంచి మంచి ఆకర్షణలతో సందర్శన చేయవచ్చు.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

వేసవి

వేసవి కాలం తంజావూరు లోని వేసవికాలాలలో ఉష్ణోగ్రతలు 25 ° C నుండి ° C. 40 వరకు ఉండి, సాధారణంగా చాలా వేడిగా ఉంటాయి. ఈ రోజులలో శరీరంలో ముఖ్యంగా కటినంగా ఉంటుంది. పర్యాటకులకు ఏప్రిల్ మరియు మే నెల రోజులలో ప్రయాణంనకు అనుకూలం కాదు. టీస్ మరియు షార్ట్స్ వంటి పల్చని బట్టలు ధరించటం మంచిది.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

వర్షాకాలం

వర్షాకాలంరుతుపవనాల సమయంలో, తేలికపాటి వర్షపాతం తంజావూరు లో ఉంటుంది. ఈ కొంచెం వర్షం ఆ ప్రాంత సౌందర్యాన్ని పెంచుతుంది. పగటి సమయంలో సాధారణంగా వేడి వాతావరణం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీకు జూన్ సెప్టెంబర్ నెలల్లో సందర్శిన ఉంటే, చిన్న వర్షం ఎలాంటి సూచన లేకుండా భారీ వర్షంగా మరే అవకాశం ఉండుట వల్ల పర్యాటకులు గొడుగును తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్ళాలి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

చలికాలం

శీతాకాలంతంజావూరు లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 20 ° C మరియు 30 ° C మధ్య ఉంటాయి. తమిళనాడులో సాంప్రదాయకంగా డిసెంబర్, మరియు జనవరి నెలల్లో వర్షపాతం కొలత చూడటానికి ప్రసిద్ధి చెందింది కాబట్టి శీతాకాలంలో సందర్శకులు ఒక గొడుగు లేదా రైన్ కోట్ ను వెంట తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి.

pc: youtube

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం

తంజావూరు ప్రైవేట్ బస్సులు, తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ యొక్క బస్సులు తమిళనాడులో ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. క్రమమైన బస్సు సర్వీసులు త్రిచి మరియు మధురై నుండి తంజావూరు వరకు ఉంటాయి.

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

రైలు మార్గం

త్రిచి జంక్షన్ సమీప రైల్వేస్టేషన్, మరియు తంజావూరు కి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రిచి జంక్షన్ నుంచి నుంచి తంజావూరు కు టాక్సీ ద్వారా చేరటానికి సగటున Rs1,000 ఖర్చవుతుంది. తిరుచ్చి రైల్వే స్టేషన్ త్రివేండ్రం-చెన్నై మార్గంలో ఒక ముఖ్యమైన అంశంగా (మధురై ద్వారా) మరియు ప్రతిరోజూ తన కార్యకలాపాలను సాగిస్తుంది.

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

విమాన మార్గం

తంజావూరు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం 61kms దూరంలో ఉన్న త్రిచి వద్ద ఉంది. సహేతుకమైన సమీపంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలు చెన్నై (322 Km) మరియు బెంగుళూర్ (433 కిమీ).

<strong>అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!</strong>అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

<strong>ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !</strong>ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !

<strong>నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !</strong>నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X