అవును ఆ వూళ్ళో దెయ్యాలున్నాయి.మీరు గానీ వాటికి కనిపించారో ఇక అంతే సంగతులు.
సూర్యాస్తమయం తర్వాత అక్కడికి వెళ్ళొద్దంటూ స్వయంగా భారత పురావస్తు సంస్తే హెచ్చరిక బోర్డ్ పెట్టిందంటే ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైఁదో అర్థం చేసుకోవచ్చు.
చిత్రం ఏంటంటే అది నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే చారిత్రాత్మక ప్రాంతం.
ఇంతకీ అదెక్కడుంది.
ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి..
ఆ ప్రాంతం పేరు భాస్ఘడ్.
pc: youtube
ఎక్కడ వుంది ?
ఢిల్లీకి సుమారు 300కి.మీల దూరంలో రాజస్థాన్ లో వుంది.
pc:youtube
ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి
అన్ని వైపులా ఆరావళి పర్వతాలతో మూసేసి వుండే ఈ ప్రాంతంలో జనావాసాలే కనిపించవు.
pc: youtube
దెయ్యాల నగరం
దెయ్యాల నగరంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం తర్వాత లోనికి అనుమతించరు.ఎందుకంటే ఆ సమయంలో దెయ్యాలు నిద్రలేస్తాయట.
pc: youtube
ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి
సమీప గ్రామాలలో నివశించే వారు వాటిని తాము చూసామని రాత్రి వేళల్లో ఏడుపులు, కేకలు వినిపిస్తాయని చెపుతూ వుంటారు.
pc: youtube
పర్యాటకుల తాకిడీ
దీంతో ఈ ప్రాంతానికి ఎక్కడా లేని ప్రచారం లభించింది. క్రమేణా పర్యాటకుల తాకిడీ పెరిగింది.
pc: youtube
పురాతన ప్యాలెస్, మందిరాలు
దెయ్యాల మాట పక్కన పెడితే ఇక్కడ పురాతన ప్యాలెస్, మందిరాలు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.
pc: youtube
ఈ కోటను ఎప్పుడు చూడవచ్చును
ఉదయం నుంచి సూర్యాస్తమయం లోపు వీటిని చూడటానికి అనుమతిస్తారు.
pc: youtube
సమీప గ్రామాల్లోని ప్రజలు
చీకటి పడేలోగా ఇక్కడనుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకోవాలని సమీప గ్రామాల్లోని ప్రజలు పర్యాటకులని హెచ్చరిస్తుంటారు.
pc: youtube
ఒకప్పుడు స్వర్గాన్ని తలపించిన నగరం
దెయ్యాల నగరంగా పేరొందిన ఈ నగరం ఒకప్పుడు స్వర్గాన్ని తలపించేది.
pc: youtube
మేధోసింగ్
1631 లో అక్బర్ సంస్థానం లోని మాన్ సింగ్ కుమారుడు మేధోసింగ్ ఈ నగరాన్ని నిర్మించారు.
pc: youtube
స్థానికులు ఏం చేపుతున్నారంటే
దాదాపు 700ఏళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లిన ఈ రాజ్యం ఓ తాంత్రికుడి శాపం వల్ల స్మశానంగా మిగిలిపోయిందని స్థానికులు చెబుతూవుంటారు.
pc: youtube
ఆసలు రత్నావతి ఎవరు?
రాకుమారి రత్నావతి పై మనసు పారేసుకున్న తాంత్రికుడు ఆమె దక్కలేదనే ఆగ్రహంతో రాజ్యాన్ని శపించాడని దీంతో ఆ రాజ్యంలో చనిపోయిన వాళ్ళంతా ప్రేతాత్మలుగా మారి
ప్రజలను భయపెట్టేవారని వాటి వేధింపులు తాళలేక అక్కడి ప్రజలు నగరాన్ని ఖాళీ చేసారనేది ఇక్కడ ప్రచారంలో వున్న కధ.
pc: youtube
పర్యాటకులతో కిటకిటలాడే ప్యాలెస్
పగటి వేళల్లో పర్యాటకులతో కిటకిటలాడుతూ వుంటుంది. ప్యాలెస్ తో పాటు అందమైన కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.
pc: youtube
ఇక్కడ చూడదగిన మందిరాలు
హనుమంతుడు, గోపీనాథ్, నవీన్ మందిరాలు చూడదగినవి.ముఖ్యంగా పురోహిత్ జీ కి బాగ్ తప్పకుండా చూడాల్సిందే. అయితే మరెందుకిక ఆలస్యం దెయ్యాలతో సెల్ఫీ తీసుకోవడానికి సిద్ధమయిపోండి.
pc: youtube