Search
  • Follow NativePlanet
Share
» »బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

గౌతమబుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఇతని అష్టాంగ మార్గాన్ని అవలంభించాడు. భగవాన్ గౌతమబుద్ధుడు ప్రవేశపెట్టిన ధ్యానమార్గం దుఃఖం మరియు పాపకర్మల నుంచి విముక్తిచెందుటకు సహాయపడుతుంది.

By Venkatakarunasri

గౌతమబుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఇతని అష్టాంగ మార్గాన్ని అవలంభించాడు. భగవాన్ గౌతమబుద్ధుడు ప్రవేశపెట్టిన ధ్యానమార్గం దుఃఖం మరియు పాపకర్మల నుంచి విముక్తిచెందుటకు సహాయపడుతుంది. ఇతను జగత్తును జ్ఞానంతో నింపటానికి జన్మించాడు. బుద్ధుడి మొదటి శిష్యుడు ఆనందం. బుద్ధుడు అంటే నిద్రనుంచి మేల్కొనుట,జాగృతుడవటం, జ్ఞాని, వికసించటం అన్నీ తెలిసినవాడు అదేవిధంగా ఇంకా అనేక అర్థాలువున్నాయి. బుద్ధునితత్వమేమంటే "ఆశే దుఃఖానికి మూలం".ఇతని గురించి చిన్నవయస్సునుంచీ మనం చదువుతూ, వింటూనే వస్తున్నాంకదా? అయితే తన చివరి శ్వాస వదిలింది ఎక్కడ?అనేది మీకు తెలుసా? అలాగైతే వ్యాసంమూలంగా అతని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్ధుని ఇంటి పేరు కాదు సిద్ధార్ధుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోధనుడు, తల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి).
బుద్ధుడు లుంబినీ వనంలోవైశాఖశుద్ధపౌర్ణమి యందు మాయాదేవి మరియు శుద్దోధనులకొడుకుగా జన్మిస్తాడు.

PC:myself

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు జన్మించిన 7రోజులతర్వాత తల్లి మాయాదేవి మరణించింది. తర్వాత 2వ తల్లియైన ప్రజాపతిదేవి పెంచిపెద్దచేస్తుంది. ఇతనికి మొట్టమొదట సిద్ధార్థ అని నామకరణంచేస్తారు.ప్రజాపతి దేవి సాకినందువలన ప్రజాపతి గౌతముడు అనీ,జ్ఞానసంపాదనైనతర్వాత బుద్ధుడు అని పిలవబడినాడు.

PC:myself

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

సిద్ధార్ధుడు పుట్టగానే అతనిలో అపూర్వమైన మహాపురుషుని లక్షణాలు వున్నాయని భక్తులు చెప్తారు. ప్రసవానికి ముందర మాయాదేవికి ఒక కల వచ్చింది. అందులో దేవతలు మాయాదేవి హిమాలయాలమీదకు పిలుచుకునిపోయి మానససరోవరంలో స్నానమాచరించి వెండి మీద బంగారు పూతపూసిన ఊయలలో ఆమెను నిద్రపుచ్చిరి.

PC:Abanindranath Tagore

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

అదేవిధంగా వెండిఏనుగు ఒకటి తన తొండంతో తామరపుష్పాన్ని పట్టుకుని,ఉత్తరదిక్కునుంచి వచ్చి మాయాదేవియొక్క బలపార్శ్వంనుంచి వుదరంలోకి ప్రవేశించెనంట.జ్యోతిష్యులుకూడా పుట్టే బిడ్డ మగపిల్లవాడుఅని , మహాయోగిఅవుతాడని చెప్పిరి.

PC:Asia Society

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

శిక్షణముగించినబుద్ధుడు అత్యంతఅందమైన, మంచి సంప్రదాయంకలిగిన అమ్మాయి యశోమతిని వివాహంచేసుకొనెను. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే బుద్ధుని తల్లిదండ్రులు బుద్ధుని తల్లితండ్రులు కౌమారదశలో పెళ్లిచేస్తే సంసారసుఖంలో నిమగ్నమౌతాడని కుమారుడికి ఒకస్వయంవరాన్ని ఏర్పాటుచేసెను.

PC: Otgonbayar Ershuu

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఒక రోజున ఊరిలోని అందరి కన్యలూ వచ్చి రాజకుమారుడినుంచి ఆభరణాలను దానంతీసుకునే సమారంభాన్ని ఏర్పాటుచేస్తారు. అంతట వూరిలోని అందరు కన్యలూవచ్చి సిద్ధార్థుని చేతులనుంచి ఆభరణాలను పొందిరి. చివరిలోవచ్చిన యశోమతికి దానంగా ఇవ్వటానికి ఆభరణాలు ఖాళీఅయిపోయినవి.

PC:Unknown

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

అప్పుడు సిద్ధార్థుడు తన వేలులో వున్న వుంగరాన్ని తీసిఇస్తుండగా అందుకు ఆమె మీరు ప్రేమతో చూడటమే నాకొక ఆభరణమని చెప్పెను. ఆమెను మెచ్చిన బుద్ధుడు వరించెను.

PC:Sarnath Museum, India.

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఒక సారి సిద్ధార్థుడు నగరసంచారానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో ఒకముసలివానిని, ఒక రోగిని మరియు ఒక చావుసన్నివేశాన్ని చూసి వ్యాకులచెందెను.దుఃఖాన్నిపొంది విరక్తి చెందెను. చింతాక్రాంతుడై ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా అతనిముందు సన్యాసి ఒకడు వెళుతుంటాడు.

PC:Unknown

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

అనంతరం బుద్ధుడు సంసారాన్ని పరిత్యాగం చేస్తాడు. బంధాన్ని పరిత్యాగం చేసి అడవికి వెళ్లే ఏకైక మార్గమే సరైన మార్గం అని నిర్ణయిస్తాడు.తను చేసిన యుద్ధాలవలన ఎంత మంది తమ ఆప్తులను కోల్పోయి ఏడుస్తున్నారో ఆలోచించి తక్షణమే తనతండ్రి శుద్దోధనుడికి తాను సన్యాసినౌతాననే విషయాన్ని తెలిపి అనుమతి కోరుతాడు.

PC:Marie-Lan Nguyen

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఇందుకు ఇష్టపడని తండ్రికి బుద్ధుడు, నా కోరికలను తీరిస్తే సంసారత్యాగాన్ని చేయను అని చెప్తారు. అదేమంటే తనకుఎప్పుడూ వృద్ధాప్యం ఉండకూడదు, అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అతను మరణం లేకుండా అమరత్వం కలిగి ఉండాలి మరియు ఏ వ్యాధి లక్షణాలు అతడిని తాకకూడదు అనే డిమాండ్లు.

PC:Daderot

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఇది అసాధ్యం అని చెప్పిన తండ్రికి, తాను సన్యాసియై సుఖనిద్రలో నిద్రపోతున్న భార్య మరియు కొడుకును కళ్ళారా చూసి బయటకు వెళ్తాడు.తర్వాత పెద్ద జ్ఞానిఅవుతాడు.ఇది సామాన్యంగా అందరికీ తెలిసిన కథే.

PC:PHGCOM

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

పరినిర్వాణ స్థూపం బౌద్ధధర్మ సంస్థాపకుడైన గౌతమబుద్ధుడు మరణించిన స్థలమని చెప్పవచ్చును. ఇది భారతదేశంలోని వుత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్ లోవున్న బౌద్ధదేవాలయం. ఆ ప్రదేశంలోని అలెగ్జాండర్ కన్నింగ్యాం చూపరులను ఆకర్షిస్తుంది.

PC:Abanindranath Tagore

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఎందుకంటే గౌతమబుద్ధుడు ఈ ప్రదేశంలోనే మరణం పొందెను అని ధృడంగా వారికి నిరూపించెను. ఈ దేవాలయం 2,500ల సంల స్మరణలో భాగంగా భారతీయ ప్రభుత్వంచే నిర్మించబడినది.
ఈ దేవాలయం లోపలిభాగంలో బుద్ధునివిగ్రహాన్ని వుత్తరానికి తలనాంచి కుడివైపుకి తిరిగినట్టువుంచబడినది.

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

ఈ విగ్రహం6.1మీ పొడవుంది. ఒక రాయిమంచం పైన బుద్ధుని పడుకొండబెట్టారు.బుద్ధుడు తన 45 వ మిషనరీ కార్యకలాపాల తరువాత, బుద్ధుడు తీవ్రంగా అనారోగ్యంతో చివరకు కుషినగర్కు చేరుకున్నాడు.

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

క్రీపూ 260 లో మౌర్య రాజు అశోక తూర్పున కుషినగర్ సందర్శించి, బుద్ధుడి నిర్యాణంపొందిన స్థలాన్ని గౌరవిస్తూ అనేక స్థూపాలను నిర్మించాడు. కుషినగర్ బౌద్ధ స్థలాలు కుషాన్ సామ్రాజ్యం ద్వారా విస్తరించబడ్డాయి.

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

బుద్ధుడు తన ప్రాణాన్ని వదిలిన స్థలం ఎక్కడుందో తెలుసా?

అయితే కుషినగర్ గుప్త సామ్రాజ్యంలో పరినిర్వాణ స్తూపం విస్తరించినప్పుడు గోల్డెన్ ఏజ్ చూసింది. అలాగే, పరినిర్వాణ దేవాలయం పెద్ద భారీ ఆశ్రయం బుద్ధిని కోసం పునర్నిర్మించబడింది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+