మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు నిర్మించబడ్డాయి. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా పూనేలో అనేక దేవాలయాలను నిర్మించారు.
ఇక స్వాతంత్ర సంగ్రామంలో ఈ పూనే లో కొంత కాలం మహాత్మాగాంధీతో పాటు అనేక మంది నాయకులను బంధించారు. ఇలా చారిత్రాత్మకంగానే కాకుండా ధార్మిక కేంద్రంగా కూడా పూనే ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పూనే లో చూడదగిన ఐదు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...
ఆగాఘాన్ ప్యాలెస్
P.C: You Tube
పూనేలోని ఆగాఘాన్ ప్యాలెస్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే కేంద్రాల్లో ఒకటి. అలనాటి మహారాష్ట్ర వాస్తు శైలిని ఈ భవనం కళ్లకు కడుతుంది. ఈ భవనాన్ని క్రీస్తుశకం 1892లో నిర్మించారు. స్వతంత్ర సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీతో పాటు ఎంతో మందిని ఈ భవనంలో ఖైదు చేసినట్లు చెబుతారు. ఈ నిర్మాణంలో మనకు కొంతవరకూ ఇటాలియన్ వాస్తు శైలి మనకు కనిపిస్తుంది. ఈ భవనంలో మనకు గాంధీతో పాటు కొంతమది స్వతంత్ర సమరయోథులకు సంబంధించిన కొన్ని వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ ఖాదీ దుస్తులు బాగుంటాయి.
శనివార్ వాడా
P.C: You Tube
మరాఠా సామ్రాజ్య వైభవానికి ఈ శనివార్ వాడ ఒక మచ్చుతునక. మూడవ ఆంగ్లో మరాఠా యుద్దంలో విజయం సాధించిన తర్వాత బాజీరావ్ పేష్వా ఈ కోటను నిర్మించినట్లు చెబుతారు. అయితే క్రీస్తు శకం 1823లో జరిగిన ఒక భారీ అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట ధ్వంసమయ్యింది. అప్పటి నుంచి ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈ కోట ముందరి భాగంలోని ఉద్యానవనం, భారీ ఫౌంటైన్లు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి.
సింహఘడ్ కోట
P.C: You Tube
పూనే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినాఘడ్ కోట ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశం కూడా. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని భూలేశ్వర్ లో ఉన్న ఈ కోట అప్పట్లో శత్రుదుర్భేద్యంగా ఉండేది. సింహఘడ్ కోట మరాఠా సామ్రాజ్యపు యుద్ధనీతిని తెలియజేస్తుంది. పూనే నుంచి వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ఈ సింహఘడ్ కోట పై భాగానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకొంటారు.
చతుశ్రింగి దేవాలయం
P.C: You Tube
చతుశ్రింగి దేవాలయం పర్వత శిఖరం పై ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ దేవాలయం పూనేకు దగ్గరగా ఉంటుంది. ఈ దేవాలయం 125 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి 100 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న పరిమాణంలో ఉన్న 8 అష్ట వినాయక విగ్రహాలతో పాటు దుర్గాదేవి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ దేవతను సందర్శించడం వల్ల మనుకొన్న పనిలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని పూనే వాసులు నమ్ముతారు.
పాతాళేశ్వర్
P.C: You Tube
పాతాళేశ్వర్ ఒక గుహాలయం. ఇది ప్రముఖ శివాలయం కూడా. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆదీనంలో ఉంది. రాష్ట్రకూటల కాలంలో కొండను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయంలోని శివలింగానికి పూజలు జరుగుతున్నాయి. శివలింగం ముందు ఉన్న మంటపంలో ఉన్న నంది విగ్రహం విలక్షణంగా ఉంటుంది.