బ్రిటీష్తో సంబంధం లేని అద్భుతమైన భారతీయ నిర్మాణాలు
బ్రిటిష్ తో ఎటువంటి సంబంధం లేకుండా భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలు చాలానే ఉన్నాయి.
అద్భుతమైన నిర్మాణ శైలితో నేటికీ చూపరులను ఆకట్టకుంటోన్న అలాంటి కట్టడాలను చూసొద్దాం రండి!
గోల్కొండ కోట, హైదరాబాద్
హైదరాబాద్లోని గోల్కొండ కోట ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది హుస్సేన్ సాగర్కు సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోల్కొండ సుల్తానేట్ కోసం కుతుబ్ షాహీ రాజవంశంచే నిర్మించబడింది. ఇది ప్రసిద్ధ వజ్రాల గనులకు సమీపంలో ఉంది. నేటికీ ఈ కోట సందర్శకుల మన్ననలను పొందుతోంది.
బరా ఇమాంబర, లక్నో
బరా ఇమాంబారా లేదా అస్ఫీ ఇమాంబర లక్నోలోని ఒక అందమైన భవన సముదాయం. దీనిని 1784లో అవధ్ నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించారు. ఓ అద్భుతమైన సందర్శనీయ ప్రదేశంగా పేరుపొందింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 25, విదేశీయులకు రూ.500 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు.
చిత్తోర్ఘర్ కోట, చిత్తోర్ఘర్
చిత్తోర్ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది . ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. రాజస్థాన్లోని చిత్తోర్ఘర్లో ఉన్న ఇది మేవార్ రాజధానిగా పనిచేసింది. మొత్తంగా సుమారు 691 ఎకరాల విస్తీర్ణంలో కోట విస్తరించి ఉంటుంది.
అంబర్ ఫోర్ట్, జైపూర్
రాజస్థాన్ జైపూర్లోని అమెర్ ఫోర్ట్ లేదా అంబర్ ఫోర్ట్ రాజా మాన్ సింగ్ మరియు సవాయ్ జై సింగ్ చేత నిర్మించబడింది. కోట లోపల భవనాలు, మండపాలు, సభామందిరాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు ఇలా అడుగడుగునా సందర్శకులను ఆకర్షించే నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఏనుగుపై సఫారీ ఇక్కడ అదనపు ఆకర్షణగా చెప్పుకొవచ్చు.
బులంద్ దర్వాజా, ఫతేపూర్ సిక్రి
బులంద్ దర్వాజా అక్బర్ కాలంలోని వాస్తుశిల్పానికి ఒక అందమైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఫతేపూర్ సిక్రీ 1641లో అక్బర్ సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది. క్రీస్తు శకం 1576లో గుజరాత్పై సాధించిన విజయానికి జ్ఞాపకార్థంగా అక్బర్ చక్రవర్తి ఈ బులందర్ దర్వాజాను నిర్మించారు.
కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా
ఈ 13వ శతాబ్దపు సూర్య దేవాలయం ఎంతో అందంగా నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం సూర్య దేవుడు సూర్యునికి అంకితం చేయబడింది. వంద అడుగుల ఎత్తయిన రథం, భారీ చక్రాలు మరియు గుర్రాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నిర్మాణ శైలికి ఎవ్వరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే.
ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, మధ్యప్రదేశ్
ఖజురహో గురించి పరిచయం అక్కర్లేదు! ఇతర విషయాలతోపాటు శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఇవి ఛతర్పూర్ జిల్లాలోని హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా పేరుగాంచాయి.
అజంతా ఎల్లోరా గుహలు, ఔరంగాబాద్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని అజంతా మరియు ఎల్లోరా గుహలు భారతదేశంలోని మరొక గొప్ప యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ గుహలు పురాతనమైనవి మరియు కొన్ని ఆసక్తికరమైన దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి కెక్కింది.
తాజ్ మహల్, ఆగ్రా
తాజ్ మహల్ ప్రస్తావన లేకుండా ఈ జాబితా పూర్తి కాదు. ప్రేమ యొక్క ప్రతిరూపం ఈ అద్భుత నిర్మాణం. ఈ తెల్లని పాలరాయి భవనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని కొత్త ఏడు వింతలలో ఒకటిగా కూడా పేరుగాంచింది.
మీనాక్షి అమ్మన్ ఆలయం, తమిళనాడు
శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం అని కూడా పిలుస్తారు. మీనాక్షి అమ్మన్ ప్రతిరూపంగా చాలా అందంగా ఉంటుంది. ఈ చారిత్రాత్మక దేవాలయం తమిళనాడులోని మధురైలో వైగై నది ఒడ్డున ఉంది.