భారత దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక మంచు పర్వతాల నడుమ ఉన్న ఉత్తరాఖండ్ లో అయితే పురాణాల్లో పేర్కొన్న ప్రతి విషయానికి సంబంధించి ఒక చిన్న దేవాలయం అయినా ఉంటుంది. అటువంటి దేవాలయాల్లో మూలవిరాట్టు ఉదయం బాలికగా, మధ్యాహ్నం ప్రౌడ మహిళగా, సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. ఇందుకు గల కారణాలు తదితర విషయాలకు సంబంధించిన కథనం మీ కోసం...

ధారి దేవి దేవాలయం
P.C: You Tube
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శ్రీనగర్ లో ప్రవహిస్తున్న అలకనందా నదీ తీరంలో అత్యంత ప్రాచీనమైన ధారాదేవి దేవాలయం ఉంది. ఈ ధారి దేవి అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు. ధారి దేవిని ధర దేవి అని కూడా పిలుస్తారు.

అలకనంద
P.C: You Tube
ఈ దేవత చల్లని చూపువల్లే అలకనందా నదీ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఎటువంటి ఆపద తలెత్తనీయకుండా చేస్తుందని స్థానిక భక్తులే కాకుండా హిందూ భక్తులు కూడా నమ్ముతారు. ఈ దేవాలయం సుమారు 8వ శతాబ్దం నుంచి ఇక్కడే ఉందని చెబుతారు.

సిద్ధపీఠం
P.C: You Tube
ఇక ఇక్కడ వెలిసిన ధారా లేదా ధరా అమ్మవారి గురించి ప్రస్తావన మన పురాణాల్లో కూడా ఉంది. ఈ దేవత ప్రస్తావన ముఖ్యంగా మహాభారతం లో ఉంది. ఇక భాగవతంలో ఈ దేవాలయాన్ని సిద్ధపీఠం అని కూడా ప్రస్తావించారు.

108 శక్తి పీఠం
P.C: You Tube
ఇక్కడ సాక్షాత్తు మహాకాళీ ధరా దేవి రూపంలో ఉండటం వల్ల అమ్మవారు అత్యంత ప్రభావంతమైన, శక్తివంతమైన దేవతగా మహాభాగవతంలో పేర్కొన్నారు. భారత దేశంలోని 108 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటిని చెబుతారు.

ఉగ్రస్వరూపిణి
P.C: You Tube
ఈ ధరా దేవిని ఉగ్రస్వరూపిణి అని పేర్కొంటారు. ఈ దేవి చల్లని చూపు మన పై ఉంటే జీవితంలో అనుకొన్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అయితే ఆమె మన పై ఆగ్రహం వ్యక్తం చేస్తే మాత్రం అనేక కష్టనష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుందని చెబుతారు.

కేదారనాథ
P.C: You Tube
క్రీస్తుశకం 1882లో ఇస్లాం రాజు ఒకరు ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇక్కడ ఒక మసీదును నిర్మించాలని చూశారు. దీంతో ఆ సమయంలో కేదారనాథ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. పర్వత శిఖర భాగాలు కరిగి ప్రవహించసాగాయి. వేల మంది చనిపోయారు.

అదే నమ్మకం.
P.C: You Tube
దీంతో ఆ ముస్లీం పాలకుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనను పక్కనపెట్టాడు. అంతేకాకుండా అప్పటి నుంచి ఎవరూ కూడా ఈ దేవాలయం జోలికి వెళ్లలేదని చెబుతారు.

గోపురం ఉండదు.
P.C: You Tube
సాధారణంగా హిందూ దేవాలయాలకు గర్భగుడి దాని పై గోపురం ఉంటుంది. అయితే ధారి దేవి దేవాలయంలో గర్భగుడి మాత్రమే ఉంది. గోపురం ఉండదు. అదే ఇక్కడి ప్రత్యేకత.

విశిష్ట రూపం
P.C: You Tube
ఇక ఈ క్షేత్రం మహిమ ఏమిటంటే ఈ దేవాయంలోని అమ్మవారు ఉదయం పూట బాలిక రూపంలో, మధ్యాహ్న సమయంలో ప్రౌడ స్త్రీగా, సాయంకాలం సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. సూర్య గమనాన్ని అనుసరించి అమ్మవారి రూపం మారుతుంది.

శ్రీనగర
P.C: You Tube
ఈ దేవాలయంలో కాళీమాత విగ్రహం కూడా ఉంది. శ్రీ నగర ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ధారా దేవి విగ్రహాన్ని తీసి కొంచెం ఎత్తులో పెట్టాలని ప్రయత్నించారు.

అన్ని ఏర్పాట్లు
P.C: You Tube
ఇందు కోసం దేవాలయాన్ని కొంతవరకూ నేలమట్టం చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేసుకొంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా వారి ప్రయత్నాన్ని మార్చలేకపోయాయి.

అలా జరిగింది
P.C: You Tube
అలకనందా నదీ జలాశయం దగ్గర నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2013 జూన్ 16 సాయంత్రం ఆరు గంటలకు ఈ దేవాలయంలో కొంత భాగాన్ని పడుగొట్టేశారు.

భోరున వర్షం
P.C: You Tube
అటు పై ఈ ధారి దేవి విగ్రహాన్ని అక్కడి నుంచి వేరేచోటికి మార్పించేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేదర్నాథ్ లో భోన వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వర్షం ఆగకుండా పడింది.

వేలమంది
P.C: You Tube
దీంతో చాలా మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. ఇక చూస్తున్నట్లుగానే పర్వత శిఖరాలు రాలిపోయాయి. ఇందుకు సంబంధించిన అన్వేషణ ప్రారంభమయ్యింది.

అందువల్లే
P.C: You Tube
ధారాదేవి దేవాలయాన్ని పడగొట్టి అక్కడి అమ్మవారి విగ్రహాన్ని స్థానభ్రంశం కలిగించినందువల్లే ఇలా రెప్పపాటులో భోరున వర్షం కురిసిందని అనేక మంది జ్యోతిష్యాస్త్ర నిపుణులు తేల్చారు.



Click it and Unblock the Notifications














