మన భారతదేశంలో వున్న ప్రసిద్ధమైన దేవాలయాలు దానికదే మహత్యాన్ని కలిగివుంది. ఆ వరుసలో ఒక క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని చెప్పవచ్చును. ఎందుకంటే ఆ క్షేత్రం మహాప్రళయం సమయానికి సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా ఇది సారక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో వెలసిన సారనాథన్ దానికదే విశిష్టతను సంతరించుకుంది. అయితే మహాప్రళయం అనంతరంకూడా వున్న ఈ క్షేత్రం వుండేది తమిళనాడులోని తిరుచ్చేరి. ఇక్కడ శ్రీమహావిష్ణువు వెలసియున్నాడు.
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఈ అందమైన దేవాలయాన్ని ద్రావిడశైలిలో నిర్మించటంజరిగింది. శ్రీ మహావిష్ణువుని సారనాథ్ అని పిలవటం జరుగుతుంది. ఈ దేవాలయం అందమైన వాస్తుశిల్పాలను కలిగియున్న అద్భుతమైన దేవాలయం. సారనాథునియొక్క భార్యయైన సారనాయకి రూపంలో లక్ష్మీదేవితో సహా ఇక్కడ వెలసియున్నది.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
సాధారణంగా అందరికీ తెలిసి విష్ణువుకి సంబంధించి 108దేవాలయాలున్నాయి. 6 నుంచి 9వ శతమానంలో తమిళనాడులోని ప్రసిద్ధమైన ఆల్వార్ విష్ణువును ప్రశంసిస్తూ 108 విష్ణు ఆలయాలను పేర్కొన్నాడు.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఆ 108దేవాలయాల పట్టికను "దివ్య దేశాలు" అని పేరుతో పిలుస్తారు. దివ్యదేశాలమూలంగా శ్రీ మహా విష్ణువు వెలసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. ఆ దివ్యదేశాల క్షేత్రాలుగురించి ప్రస్తుత వ్యాసంలో తెలియజేయబోయే వాటిల్లో సారనాథ్ క్షేత్రం ఒకటిగా చెప్పబడినది. ఇక్కడుండే విష్ణుదేవాలయాన్ని సారనాథ్ దేవాలయంఅని పిలుస్తారు.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనదేకాదు గొప్పఇతిహాసాన్ని కూడా కలిగివుంది. మధ్యకాలాన్ని పరిపాలించిన చోళులనుంచి విజయనగరరాజుల పరిపాలనవరకూ మరియు మదురైనాయకులవరకూ ఈ దేవాలయాన్ని నిర్మించారు.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఈ క్షేత్రంలో మార్కండేయ, కావేరీదేవి మరియు ఇంద్రులకు శ్రీమహావిష్ణువు సారనాథ్ రూపంలో దర్శనాన్ని కల్పించారనే ప్రతీతి వుంది. అదేవిధంగా ఇది తమిళనాడులోని ప్రసిద్ధమైన వైష్ణవదేశాలలో ఇది కూడా ఒకటిగా వుంది.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
సారనాథ్ గా వెలసిన శ్రీ మహావిష్ణువు వైష్ణవసాంప్రదాయంలో ఇక్కడ దిననిత్యం 6సార్లు విశేషమైన పూజలు జరుగుతాయి. అందులో తమిళమాసమైన చిత్తిరైలో జరిగే వుత్సవం అత్యంత ప్రముఖమైనది.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఆ సమయంలో రాష్ట్రంనలుమూలలనుంచి ఈ స్వామి వుత్సవంలో పాల్గొనటానికి భక్తులు తరలివస్తారు. ఈ దేవాలయానికి ఒక పురాణకథ కూడా వుంది. ఒక కొత్తయుగానికి నాంది పలికింది.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
అప్పుడు బ్రహ్మ ఈ జీవసృష్టికి అవసరమైన వస్తువులను మరియు వేదశాస్త్రాల గురించి శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాడు. అందుకే మహావిష్ణువు మట్టికుండను ఒక దానిని చేసి అందులో అవసరమైన వస్తువులను వుంచమని చెప్తాడు.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
ఈవిధంగా బ్రహ్మ మట్టితో ఒక కుండను తయారుచేస్తాడు.ఆ కుండను తయారుచేయటానికి వుపయోగించిన మట్టి ఈ క్షేత్రందే అనినమ్మకం. ఆ విధంగా మహాప్రళయంసమయంలో కూడా ఈ క్షేత్రం హరియొక్క అనుగ్రహంవలన చెక్కుచెదరకుండా అలాగే వుందని స్థలపురాణం.
PC:Ssriram mt
మహాప్రళయం అనంతరంకూడా చెక్కుచెదరకుండా వున్న అద్భుతమైన క్షేత్రమిది...!
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణం క్షేత్ర శివార్లలోవున్న తిరుచ్చేరి అనే గ్రామంలో ఈ సారనాథుని మహిమాన్వితమైన దేవాలయంవుంది. ఎంతోమంది భక్తులను ఈ అందమైన దేవాలయం ఆకర్షిస్తుంది. పర్యాటకులు కుంబకోణం సందర్శించినప్పుడు తరచుగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శిస్తారు.
PC:Ssriram mt