తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. అని మహాకవి కాళిదాసు వర్ణించారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని దీనర్థం. కర్నూలు నగరానికి 450 కిలోమీటర్లు దూరంలో ఉండే కాంచీపురాన్ని చూసేందుకు వేసవిలో జిల్లా వాసులు చాలా మంది వెళ్తుంటారు.
ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో అమ్మవారు ఏడు సంవత్సరాల బాల రూపంలో అవతరించారని చెబుతారు.
కామాక్షిదేవి ఇక్కడ కారణ, బింబం, సూక్ష్మం అనే మూడు రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్నారు. భారతదేశంలోనే సప్త మోక్షపురాలలో కంచి క్షేత్రం ఒకటి.
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కంచి కామాక్షి
అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి కామాక్షి దేవి ఒకరు. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది.
pc:tshrinivasan

2. శాంతి, సౌభాగ్యాలు
పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
pc:Emeldil

3. కామాక్షి అమ్మవారి దేవాలయం
పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజ పెరుమాల్, ఉలగలంద పెరుమాల్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాను చూడవచ్చు.
pc:youtube

4. తిరువూరగం క్షేత్రం
సర్పరూపంలో శ్రీమహావిష్ణువు కనిపించే తిరువూరగం క్షేత్రం.
pc:youtube

5. ఉలగందం పెరుమాళ్ ఆలయం
తమిళనాడులోని పెదకాంచీపురంలోని ఈ ఉలగందం పెరుమాళ్ ఆలయం పరమపవిత్రమైన శ్రీ వైష్ణవ దివ్యదేశమై వుంది.
pc:Ksssshl

6. దివ్యదేశము
చెన్నై నుండి మరియు కాంచీపురం నుండి ఈ దివ్యదేశమునకు చేరవచ్చు.
pc:Adityamadhav83

7. మూలవిరాట్
ఇక్కడి మూలవిరాట్ పేరు త్రివిక్రమ్ ఉలగలంద పెరుమాళ్.
pc:youtube

8. పశ్చిమం
ఈ పెరుమాళ్ పశ్చిమం వైపు తిరిగి నిలుచుని వుంటాడు.
pc:S Balaji

9. అమృతవల్లి
ఇక్కడ అమ్మవారి పేరు అమృతవల్లి. ఉత్సవ పెరుమాళ్ పేరు పెరకట్టన్.
కంచిలోని బంగారు, వెండి బల్లి రహస్యాలు మీకు తెలుసా ?
pc:RAJUKHAN SR RAJESH

10. ఉలగందల్ పెరుమాళ్ రూపం
త్రివిక్రముని పాదముల క్రింద అణిగిపోయి పాతాళ లోకమునకు చేరిన బలిచక్రవర్తి త్రివిక్రముని దర్శించవలెనని కోరిక కలిగినప్పుడు శ్రీ మహావిష్ణువు ఉలగందల్ పెరుమాళ్ రూపంలో బలిచక్రవర్తికి సాక్షాత్కరించాడు.
pc:Wikiveer

11. 60,000 గజములు
ఇక్కడి పెరుమాళ్ ఆది శేషుని రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయము 60,000 గజములో విస్తరించి వుంది.
pc:youtube

12. రాజగోపురము
ఈ ఆలయమునకు 3 అంతస్తులు గల రాజగోపురము, 2 ప్రాకారములు కలవు.
pc:KARTY JazZ

13. బ్రహ్మోత్సవాలు
ఈ ఆలయములో ప్రతీరోజూ పెరుమాళ్ కి రెండు పర్యాయములు తిరువరారాధన జరుగును. పుష్యమాసంలో పెరుమాళ్ కి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
కాంచీపురం ... పట్టు వస్త్రాల నగరం !
pc:SukanyaNagarajan

14. దివ్యక్షేత్రం
సర్పదోషంతో బాధపడుతున్నవారు ఈ దివ్యక్షేత్రంలో వెళ్లి ఇక్కడ సర్పరూపంలో వెలసిన ఆదిశేషుడిని ఆరాధించినట్లయితే వారి దోషం తొలిగిపోతుంది.
వేదంతంగల్ ఒక పురాతన పక్షి అభయారణ్యం !
pc:Vishwajith33

15. ఎలా వెళ్ళాలి
కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు.
PC:youtube

16. బస్సు సౌకర్యం
చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది.
చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?
PC:Arivumathi

17. రైలు మార్గం
రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది.
PC:Shyamsharai
- సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
- ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
- మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?



Click it and Unblock the Notifications














